Friday, March 20, 2026

తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు తల్లీ కుమారుడు మృతి !

తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురితో పాటు తల్లీ కుమారుడు మృతి !

 


తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సేలం పట్టణ సమీపంలోని ఉత్తమశోలపురం వద్ద ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి అదుపుతప్పి మినీ వ్యాన్‌తో పాటు మరో బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించగా.. బైక్‌పై వెళ్తున్న తల్లీకుమారుడు అక్కడికక్కడే మరణించారు. తంతి టీవీ ప్రకారం.. ఈ బస్సు కోయంబత్తూరు నుంచి సేలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో పదకొండు నెలల పసికందు, ఐదేళ్ల చిన్నారి కూడా ఉండటం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది.

ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై క్షణాల్లో జరిగిన ఈ భీకర ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఎనిమిది నిండు ప్రాణాలను గాలిలో కలిపేసింది.

Wednesday, March 11, 2026

 హైదరాబాద్ నుంచి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం హార్డ్ ల్యాండింగ్.. ఏం జరిగింది అంటే?

హైదరాబాద్ నుంచి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం హార్డ్ ల్యాండింగ్.. ఏం జరిగింది అంటే?

 



ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఒక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం హార్డ్ ల్యాండింగ్ చేయడంతో రన్‌వే తాత్కాలికంగా బంద్ చేశారు. ఈ ఘటనలో హైదరాబాద్‌ నుంచి వెళ్లిన విమానం ల్యాండింగ్ గేర్‌కు నష్టం కలగడంతో అక్కడికి చేరుకోవాల్సిన ఇతర విమానాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

మార్చి 11 మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్–ఫుకెట్ మార్గంలో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్ 737 MAX 8 విమానం రన్‌వేపై సమస్యను ఎదుర్కొంది. VT-BWQ రిజిస్ట్రేషన్ కలిగిన ఈ విమానం హార్డ్ ల్యాండింగ్ కారణంగా ఒక చక్రం విడిపోయినట్లు సమాచారం.

ప్రాథమిక పరిశీలనల్లో విమానం ముందు భాగంలోని నోస్ ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీనివల్ల విమానాన్ని వెంటనే రన్‌వే నుండి తొలగించడం సాధ్యపడలేదు. విమానంలో మొత్తం ఏడుగురు సిబ్బంది, 131 మంది ప్రయాణికులు మరియు ఇద్దరు శిశువులు ఉన్నారు. మొత్తం 133 మంది ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దింపి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు.

Monday, March 9, 2026

పేదలపై ఇంత అన్యాయమా?.. వెలుగుమట్ల ఘటనపై కవిత ఫైర్.. పోలీసుల అరెస్ట్

పేదలపై ఇంత అన్యాయమా?.. వెలుగుమట్ల ఘటనపై కవిత ఫైర్.. పోలీసుల అరెస్ట్

 


ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనంలో వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన బాధితులను ఆమె పరామర్శించారు. వారి సమస్యలను స్వయంగా విని ధైర్యం చెప్పారు. బాధిత మహిళలు తమ పరిస్థితిని వివరించగా కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితుల పరిస్థితి చూస్తే మనసు కలిచివేస్తుందని అన్నారు. పరీక్షల సమయంలో పిల్లలు చదువుకుంటున్న సమయంలోనే రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లు కూల్చివేయడం బాధాకరమని పేర్కొన్నారు. పుస్తకాలు, చదువు సామగ్రి కూడా బయటపడేలా ఇళ్లను నేలమట్టం చేయడం అన్యాయమని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

Monday, March 2, 2026

యాలకుల తోట కార్మికుడు ఇప్పుడు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు. అది కూడా MSc, MED, MPhil లలో మొదటి ర్యాంకుతో. The Real Kerala Story

యాలకుల తోట కార్మికుడు ఇప్పుడు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు. అది కూడా MSc, MED, MPhil లలో మొదటి ర్యాంకుతో. The Real Kerala Story

 


ఇడుక్కిలోని మంచుతో కప్పబడిన యాలకుల తోటలలో ఎండలో, వానలో పనిచేసిన ఆ చేతులు నేడు జ్ఞాన ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తున్నాయి ✍️. కాంచియార్‌లోని పెజుంకండమ్‌కు చెందిన సెల్వమరి జీవితం, చిరునవ్వుతో తమ కలలను జయించాలనుకునే ఏ సాధారణ వ్యక్తికైనా గొప్ప పాఠం 🏔️.


తోటల కార్మికులుగా ఉన్న తల్లిదండ్రుల కుమార్తెగా జన్మించిన సెల్వమరి జ్ఞానం వైపు ప్రయాణం కుమిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ప్రారంభమైంది 🏫. ఆమె చదువులో మంచిగా ఉన్నప్పటికీ, కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు తరచుగా అడ్డంకిగా మారాయి. అయితే, ఆమె వదులుకోవడానికి సిద్ధంగా లేదు. రోజంతా యాలకుల తోటలో పని చేయడం ద్వారా సంపాదించిన ఆదాయంతో ఆమె ఉన్నత విద్యకు తన మార్గాన్ని కనుగొంది 🌿.


కట్టప్పనలోని సెయింట్ జాన్స్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ మరియు తరువాత బి.ఎడ్ పొందిన సెల్వమరి, చదువు పట్ల అపరిమితమైన ఉత్సాహంతో రాజధాని నగరానికి రైలు ఎక్కింది 🎓. తిరువనంతపురంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ కాలేజీ నుండి మలయాళ ఎం.ఫిల్‌లో మొదటి ర్యాంకు సాధించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది 🥇. ఈ అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ, ఆమె తన మూలాలను మరచిపోలేదు; ఆమె తన స్వస్థలానికి తిరిగి వెళ్లి సెలవుల్లో ఏలకుల తోటలలో పనిచేసేది మరియు ఎల్లప్పుడూ తన కుటుంబాన్ని పోషించేది.


PSC పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు, ఆమె తోటలో పనిచేస్తుండగా, ఆమెకు కాంచియార్ ప్రభుత్వ LP పాఠశాలలో LPSA ఉద్యోగం వచ్చిందనే వార్త వచ్చింది ✨. ఆనందంతో, మరేమీ ఆలోచించకుండా, ఆమె తోట కార్మికుడి వేషంలో పాఠశాలకు వచ్చి బాధ్యతలు స్వీకరించింది. ఆ రోజు కేరళ మొత్తం ఆమె బురద బట్టలు, చేతిలో కత్తి, మరియు ఆత్మవిశ్వాసంతో ఉన్న ముఖంతో ఆమెను ఆశ్చర్యంగా చూసి ఉండాలి 🪵🔥.


కానీ సెల్వమేరి LP పాఠశాల ఉపాధ్యాయురాలిగా మారడం ద్వారా తన ప్రయాణాన్ని ముగించలేదు. పని చేస్తున్నప్పుడు, ఆమె తన చదువును కొనసాగించింది మరియు K-TET పరీక్షలలో ఉత్తీర్ణురాలైంది మరియు కష్టపడి ఉన్నత పాఠశాల విభాగానికి (HST) పదోన్నతి పొందింది ✌️. ఆ పెద్ద కల నెరవేరడంతో, ఆమె ఇప్పుడు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలిగా తన కెరీర్‌లో మరో పెద్ద అడుగు వేసింది 🌟.


పరిమితులు కాదు, లక్ష్యాన్ని సాధించాలనే స్పృహతో కష్టపడి పనిచేయడమే విజయానికి ఆధారం అని సెల్వమరి నిరూపించింది 💯. నేడు, తరగతి గదుల్లో పిల్లలకు అక్షరాలు నేర్పుతున్నప్పుడు కూడా, ఈ ఉపాధ్యాయురాలు తాను పెరిగిన యాలకుల తోటలను మరియు ఆమె శ్రమ చెమటను ఎంతో గర్వంగా గుర్తుంచుకుంటుంది 🎓✨.

Thursday, February 26, 2026

ఇజ్రాయెల్ పర్యటన విజయవంతం.. ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు

ఇజ్రాయెల్ పర్యటన విజయవంతం.. ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు



 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గురువారం జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ముఖ్యమైన చర్చలు జరిపారు మోదీ. ఈ సమావేశంలో రక్షణ, అంతరిక్ష, సైబర్ భద్రత, జల నిర్వహణ వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్–ఇజ్రాయెల్ మధ్య పలు ముఖ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. చర్చల అనంతరం రెండు దేశాల ప్రధానులు సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారి సమక్షంలో అనేక కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) పరస్పరం మార్పిడి అయ్యాయని తెలిపారు.

కృత్రిమ మేధస్సు, యూపీఐ రంగాల్లో ఒప్పందాలు

మోదీ, నేతన్యాహూ సమక్షంలో భారత్–ఇజ్రాయెల్ మధ్య పలు ముఖ్యమైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రంగంలో పరస్పర సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే ఆర్థిక అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు యూపీఐ (UPI) సంబంధిత అవగాహన ఒప్పందం కూడా మార్పిడి అయింది. భారత రాయబారి జేపీ సింగ్ ఇజ్రాయెల్ ప్రతినిధులతో కలిసి ఈ ఒప్పందాల పత్రాలను పంచుకున్నారు. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను చూపనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Monday, February 23, 2026

ట్రంప్‌కు బిగ్ షాక్.. సొంత దేశంలో దారుణంగా పడిపోయిన గ్రాఫ్

ట్రంప్‌కు బిగ్ షాక్.. సొంత దేశంలో దారుణంగా పడిపోయిన గ్రాఫ్

 


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సొంత దేశంలో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడిగా ఆయన రెండో దఫా పదవీకాలంలో ప్రజాదరణ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. తాజాగా వెలువడిన పలు జాతీయ సర్వేలు ఈ సంచలన విషయాలను వెల్లడించాయి. గాలప్, సీఎన్ఎన్, ఏపీ-నార్క్ వంటి ప్రముఖ సంస్థలు నిర్వహించిన తాజా సర్వేల ప్రకారం, ట్రంప్ పాలనను కేవలం 36 నుంచి 39 శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నారు. అదే సమయంలో 60 శాతానికి పైగా అమెరికన్లు ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.


దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, ఆకాశాన్నంటుతున్న ధరలు, ద్రవ్యోల్బణం, కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలతో పాటు విదేశీ వ్యవహారాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఈ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రెండు వేల ఇరవై ఆరు మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ గ్రాఫ్ ఈ స్థాయిలో పడిపోవడం రిపబ్లికన్ పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. రెండో దఫా పాలన మొదలైన అతి కొద్ది కాలంలోనే ఈ స్థాయిలో జనాదరణ కోల్పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Saturday, February 21, 2026

బ్రెజిల్‌ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ.. త్వరలో 20 బిలియన్ డాలర్ల వాణిజ్యం !

బ్రెజిల్‌ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ.. త్వరలో 20 బిలియన్ డాలర్ల వాణిజ్యం !



 భారత్, బ్రెజిల్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో శనివారం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో ( Lula da Silva)  ఆయన ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. లాటిన్ అమెరికా ప్రాంతంలో భారత్‌కు బ్రెజిలే అత్యంత పెద్ద వాణిజ్య భాగస్వామి అని ఆయన గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ డాలర్ల మార్కును సునాయాసంగా అధిగమిస్తుందన్న బలమైన విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అధ్యక్షుడు లులా చూపుతున్న అంకితభావానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఈ ఆర్థిక, వాణిజ్య సహకారం కేవలం మనకే కాకుండా గ్లోబల్ సౌత్ అనబడే యావత్ అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు, పురోగతికి ఎంతగానో దోహదపడుతుందని మోదీ విశ్లేషించారు. అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల గొంతుక మరింత బలంగా వినిపిస్తుందని ఆయన ఆకాంక్షించారు.