Wednesday, March 11, 2026

హైదరాబాద్ నుంచి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం హార్డ్ ల్యాండింగ్.. ఏం జరిగింది అంటే?

SHARE

 



ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఒక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం హార్డ్ ల్యాండింగ్ చేయడంతో రన్‌వే తాత్కాలికంగా బంద్ చేశారు. ఈ ఘటనలో హైదరాబాద్‌ నుంచి వెళ్లిన విమానం ల్యాండింగ్ గేర్‌కు నష్టం కలగడంతో అక్కడికి చేరుకోవాల్సిన ఇతర విమానాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

మార్చి 11 మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్–ఫుకెట్ మార్గంలో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన బోయింగ్ 737 MAX 8 విమానం రన్‌వేపై సమస్యను ఎదుర్కొంది. VT-BWQ రిజిస్ట్రేషన్ కలిగిన ఈ విమానం హార్డ్ ల్యాండింగ్ కారణంగా ఒక చక్రం విడిపోయినట్లు సమాచారం.

ప్రాథమిక పరిశీలనల్లో విమానం ముందు భాగంలోని నోస్ ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీనివల్ల విమానాన్ని వెంటనే రన్‌వే నుండి తొలగించడం సాధ్యపడలేదు. విమానంలో మొత్తం ఏడుగురు సిబ్బంది, 131 మంది ప్రయాణికులు మరియు ఇద్దరు శిశువులు ఉన్నారు. మొత్తం 133 మంది ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దింపి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు.

SHARE

Author: verified_user